దయచేసి మీకు నచ్చిన భాషను ఎంచుకోండి
<p>ఈ పుస్తకాన్ని ఏప్రిల్ 2016న కోడూరి విజయకుమార్ వాకిలి పత్రికలో సమీక్షించారు.</p>
రామా చంద్రమౌళి సమకాలీన తెలుగు రచయితలలో ఒకరు.రామా కనకయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు జూలై 8, 1950లో జన్మించిన రామా చంద్రమౌళి ఎం.ఎస్(మెకానికల్) ఎఫ్.ఐ.ఇ, పిజిడిసిఎ చదివారు. వీరు ప్రస్తుతం ప్రొఫెసర్గా, వైస్ ప్రిన్సిపాల్గా వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు.రాష్ట్రపతి, రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ స్వర్ణపతక పురస్కారాలు పొందారు. సరోజినీనాయిడు జాతీయ పురస్కారం (కులాల కురుక్షేత్రం సినిమాకు), ఉమ్మెత్తల సాహితీ పురస్కారం(1986), నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం (1986) ఏపి పాఅలిటెక్నిక్ అధ్యాపక అవార్డు (2000),భాగ్య అవార్డు (2005), ఆంధ్రసారస్వత సమితి పురస్కారం(2006), అలాగే అనేక పోటీలతో వీరు అవార్డులు పొందడం జరిగింది. ‘యాజ్ ది విండో ఓపెన్స్’గా వెలువడ్డ మాతృక ‘కిటికీ తెరిచిన తర్వాత’ కవిత్వ సంపుటి ‘2007- తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం’ పొందింది. స్వాతి శ్రీపాద అనువదించిన ‘ఇన్ఫెర్నో’ మూలగ్రంథం ‘అరతర్ధహనం’ కవిత్వం ‘2008-సినారె కవిత్వ పురస్కారం’ సాధించింది. జి.ఎం.ఆర్. రావి కృష్ణమూర్తి కథా పురస్కారం (2008). వీరి సాహిత్యంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య కె.యాదగిరి నేతృత్వంలో రామాచంద్రమౌళి - సమగ్ర సాహిత్యం పరిశోధన అంశంపై జ్వలితచే పి.హెచ్.డి చేస్తున్నారు.అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్లో ఆచార్య కాత్యాయినీ విద్మహే నేతృత్వంలో రామాచంద్రమౌళి - కథలూ అంశంపై ఎంఫిల్ పరిశోధన జరుగుతున్నది. వీరి నవలలపై ఆచార్య జ్యోతి నేతృత్వంలో రామాచంద్రమౌళి - నవలలు అంశంపై ఎంఫిల్ పరిశోధన జరుగుతున్నది.'ఎడారిలో చంద్రుడు' (నవల), 'చదరంగంలో మనుషులు' కన్నడంలోకి అనువదించబడ్డాయి. 8 కథలు కన్నడంలో టెలీ కథలుగా ప్రసారం చేయబడ్డాయి. దాదాపు 20 కథలు ఇంగ్లిష్, కన్నడ, తమిళ, పంజాబీ భాషల్లోకి అనువదించబడ్డాయి.
రామా చంద్రమౌళి సమకాలీన తెలుగు రచయితలలో ఒకరు.రామా కనకయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు జూలై 8, 1950లో జన్మించిన రామా చంద్రమౌళి ఎం.ఎస్(మెకానికల్) ఎఫ్.ఐ.ఇ, పిజిడిసిఎ చదివారు. వీరు ప్రస్తుతం ప్రొఫెసర్గా, వైస్ ప్రిన్సిపాల్గా వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు.రాష్ట్రపతి, రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ స్వర్ణపతక పురస్కారాలు పొందారు. సరోజినీనాయిడు జాతీయ పురస్కారం (కులాల కురుక్షేత్రం సినిమాకు), ఉమ్మెత్తల సాహితీ పురస్కారం(1986), నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం (1986) ఏపి పాఅలిటెక్నిక్ అధ్యాపక అవార్డు (2000),భాగ్య అవార్డు (2005), ఆంధ్రసారస్వత సమితి పురస్కారం(2006), అలాగే అనేక పోటీలతో వీరు అవార్డులు పొందడం జరిగింది. ‘యాజ్ ది విండో ఓపెన్స్’గా వెలువడ్డ మాతృక ‘కిటికీ తెరిచిన తర్వాత’ కవిత్వ సంపుటి ‘2007- తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం’ పొందింది. స్వాతి శ్రీపాద అనువదించిన ‘ఇన్ఫెర్నో’ మూలగ్రంథం ‘అరతర్ధహనం’ కవిత్వం ‘2008-సినారె కవిత్వ పురస్కారం’ సాధించింది. జి.ఎం.ఆర్. రావి కృష్ణమూర్తి కథా పురస్కారం (2008). వీరి సాహిత్యంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య కె.యాదగిరి నేతృత్వంలో రామాచంద్రమౌళి - సమగ్ర సాహిత్యం పరిశోధన అంశంపై జ్వలితచే పి.హెచ్.డి చేస్తున్నారు.అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్లో ఆచార్య కాత్యాయినీ విద్మహే నేతృత్వంలో రామాచంద్రమౌళి - కథలూ అంశంపై ఎంఫిల్ పరిశోధన జరుగుతున్నది. వీరి నవలలపై ఆచార్య జ్యోతి నేతృత్వంలో రామాచంద్రమౌళి - నవలలు అంశంపై ఎంఫిల్ పరిశోధన జరుగుతున్నది.'ఎడారిలో చంద్రుడు' (నవల), 'చదరంగంలో మనుషులు' కన్నడంలోకి అనువదించబడ్డాయి. 8 కథలు కన్నడంలో టెలీ కథలుగా ప్రసారం చేయబడ్డాయి. దాదాపు 20 కథలు ఇంగ్లిష్, కన్నడ, తమిళ, పంజాబీ భాషల్లోకి అనువదించబడ్డాయి.