దయచేసి మీకు నచ్చిన భాషను ఎంచుకోండి
“ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్, సర్వస్వం రాసిస్తా నా బాల్యం నాకిచ్చెయ్” అన్నారో కవి. “విజ్ఞానం అనే మహాసంద్రం ఒడ్డున గులకరాళ్ళేరుకుంటున్న పసి వాణ్ణి నేను” అన్నాడు ఐన్స్టీన్ మహాశయుడు. మరెందరో ...
ముందుగా ప్రతిలిపి పాఠకులకు శుభాకాంక్షలు! ఎన్నో ప్రయాసలకోర్చి ‘ప్రతిలిపి అంతర్జాల పత్రిక’ను నిర్వహిస్తున్న ఆ పత్రిక యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు, శ్రీ జానీ తక్కెడశిల గారికి ప్రత్యేక అభినందనలు. ఏ ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలౌతుంది కదా! సాహితీ ప్రయాణం కూడా అంతే! మనలో అందరికీ రోజు వారీగా అనేక అనుభవాలు ఎదురౌతాయి. కొన్ని సంఘటనలు మనకు వినోదాన్ని కలిగించవచ్చు. మరికొన్ని విజ్ఞానాన్ని, కొన్ని విలువైన జీవిత పాఠాలనూ అందించవచ్చు. ఈ సంఘటనలు దాదాపు అందరిలో కొన్ని స్పందనలను కలిగిస్తాయి. కొన్ని సార్లు ఆ సంఘటనల, అనుభవాల తీవ్రతను బట్టి, అవి మనలో ఆలోచనలను కలిగిస్తాయి. అవి మనల్ని కొంతకాలం పాటు వెంటాడవచ్చు కూడా! ఆ వెంటాడే స్పందనలకు అక్షర రూపాన్ని కలిగిస్తే, అవి ఒక కవితగానో, కథగానో, నవలగానో, వ్యాసంగానో మరేదైనా సాహితీ రూపంగానో రూపు దిద్దుకుంటాయి. వాటిని ఇతరులతో పంచుకుంటే, ఆ చర్య మనకు ఒకరకమైన సంతృప్తిని ఇవ్వడమే కాకుండా, కొంత సామాజిక ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది. మన రచనలను ఇతరులతో పంచుకోవడం ఒక సామాజిక బాధ్యత కూడా! మన రచనలను చదువరులకు చేరవేయడానికి ఎన్నో మాధ్యమాలున్నాయి. అందులో సాహిత్య పత్రికలు (దిన, వార, మాస) పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. పుస్తక రూపంలో అచ్చై పాఠకులను అలరించే వాటితోబాటుగా, అంతర్జాల పత్రికలు కూడా దిగ్విజయంగా, రచయితల, కవుల రచనలను చదువరులకు చేరవేయడంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ అంతర్జాల పత్రికలు చాలా వెసులుబాటును, సౌలభ్యాన్ని మనకు కలిగిస్తాయి. ప్రపంచమంతా, ఒక కుగ్రామంగా మారిపోయిన ఈ సందర్భంలో, అంతర్జాల పత్రికల పాత్ర చాలా ముఖ్యమైనది. క్రమేపీ, అచ్చు పుస్తకాల స్థానాన్ని పూర్తిగా ఆక్రమించుకోకపోయినా, చాలా వరకు వాటికి ఒక ప్రత్యామ్నాయాంగా, అంతర్జాల పత్రికలు, వేదికలు పనిచేస్తున్న విషయాన్ని మనం ఇక ఏమాత్రం విస్మరించజాలం. ఈ నేపథ్యంలో, ముఖ్యంగా మనుషుల మధ్య భౌతిక దూరాన్ని ఒక అత్యావసర సందర్భంగా మార్చివేసిన కోవిడ్-19 ప్రపంచాన్నంతటినీ గడ గడలాడిస్తున్న ఈ తరుణంలో, అంతర్జాల పత్రికలు పోషిస్తున్న పాత్ర చాలా గణనీయమైనది. ఇప్పుడు సాహితీ సేవ చేస్తున్న అంతర్జాల పత్రికలలో, ‘ప్రతిలిపి’ నిస్సంశయంగా ముందువరసలో నిలుస్తుంది. ‘ప్రతిలిపి’ చేస్తున్న సాహితీ యజ్ఞంలో, నేను కూడా ఎంతో కొంత నా రచనల ద్వారా పాలుపంచుకోవడం నాకు చాలా ఆనందదాయకం. నాలాగా, ఇంకా ఇతర రచయితలు, రచయిత్రుల్లాగా, ఎవరైనా తమ రచనలను ప్రతిలిపి ద్వారా పాఠకులకు చేరవేయవచ్చు. ఇదొక సులభమైన మార్గం. ‘ప్రతిలిపి’లో నా రచనల్ను ముద్రించడం ద్వారా నేను ఎంతో మంది అనుచరులను సంపాదించుకున్నాను, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది! అందుకు నా అనుచరులకు, ఈ అవకాశాన్ని కలిగించిన ‘ప్రతిలిపి’ యాజమాన్యానికి నేను కృతజ్ఞుడిని. కొందరు పాఠకులు కేవలం అనుసరించడమే కాకుండా, నా రచనలను చదివి తమ అమూల్యమైన అభిప్రాయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి నాకు చాలా స్ఫూర్తిని కలిస్గితూ ఉంటాయి. నా రచనలపై వచ్చే విమర్శ నాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. నేను చేయబోయే తదుపరి రచనలకు అది ఒక చుక్కానిగా పని చేస్తుంది. వర్ధమాన రచయిత/రచయిత్రులకు కొన్ని సూచనలు 1.రచనలు చేయాలనుకునే వారు, ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని ఇష్టంతో అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. మనకు ఎందరివో లబ్ద ప్రతిష్టులైన కవుల, రచయితల రచనలు పుస్తక రూపంలోనూ, అంతర్జాలంలో నిక్షిప్తపరచబడి ఉన్నాయి. వాటిని తరచుగా, ఒక అలవాటుగా చదువుతూ ఉండాలి. 2.అలాగే క్రమం తప్పకుండా తమకు కలిగిన భావాలను, స్పందనలకు అక్షర రూపం ఇస్తూ ఉండాలి. రాసిన వాటిని మరల, మరలా సరిచూసుకుని, స్వసమీక్ష/ఇతరుల చేత సమీక్షింప చేసుకుని, తదుపరి పత్రికలకు పంపాలి. 3.కొత్తలో మన రచనలు కొన్ని పత్రికలచే తిరస్కరించబడవచ్చు. ఐనా నిరాశ చెందరాదు. ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. ఎక్కడ మన రచన ప్రామాణికంగా లేదో తెలుసుకుని, రచనను మెరుగుపరచాలి. 4.ఒక శిల్పి తన శిల్పాన్ని చెక్కినట్లు, తదేక ఏకాగ్రతతో, మన రచనలను మనమే ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు తెలిసిన కొన్ని విషయాలను క్లుప్తంగా మాత్రమే తెలియచెయ్యడం జరిగింది. ఇంకా వివిధ మార్గాల్లో రచనలు చేయబోయేవారు తమ రచనా సామర్ధ్యానికి మెరుగులు పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ తొలి రచనను మొదలు పెట్టండి, పూర్తి చెయ్యండి. ప్రతిలిపిలో ప్రచురించండి!!! శుభాకాంక్షలతో శివ్ (బి.వి. శివ ప్రసాద్)
ముందుగా ప్రతిలిపి పాఠకులకు శుభాకాంక్షలు! ఎన్నో ప్రయాసలకోర్చి ‘ప్రతిలిపి అంతర్జాల పత్రిక’ను నిర్వహిస్తున్న ఆ పత్రిక యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు, శ్రీ జానీ తక్కెడశిల గారికి ప్రత్యేక అభినందనలు. ఏ ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలౌతుంది కదా! సాహితీ ప్రయాణం కూడా అంతే! మనలో అందరికీ రోజు వారీగా అనేక అనుభవాలు ఎదురౌతాయి. కొన్ని సంఘటనలు మనకు వినోదాన్ని కలిగించవచ్చు. మరికొన్ని విజ్ఞానాన్ని, కొన్ని విలువైన జీవిత పాఠాలనూ అందించవచ్చు. ఈ సంఘటనలు దాదాపు అందరిలో కొన్ని స్పందనలను కలిగిస్తాయి. కొన్ని సార్లు ఆ సంఘటనల, అనుభవాల తీవ్రతను బట్టి, అవి మనలో ఆలోచనలను కలిగిస్తాయి. అవి మనల్ని కొంతకాలం పాటు వెంటాడవచ్చు కూడా! ఆ వెంటాడే స్పందనలకు అక్షర రూపాన్ని కలిగిస్తే, అవి ఒక కవితగానో, కథగానో, నవలగానో, వ్యాసంగానో మరేదైనా సాహితీ రూపంగానో రూపు దిద్దుకుంటాయి. వాటిని ఇతరులతో పంచుకుంటే, ఆ చర్య మనకు ఒకరకమైన సంతృప్తిని ఇవ్వడమే కాకుండా, కొంత సామాజిక ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది. మన రచనలను ఇతరులతో పంచుకోవడం ఒక సామాజిక బాధ్యత కూడా! మన రచనలను చదువరులకు చేరవేయడానికి ఎన్నో మాధ్యమాలున్నాయి. అందులో సాహిత్య పత్రికలు (దిన, వార, మాస) పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. పుస్తక రూపంలో అచ్చై పాఠకులను అలరించే వాటితోబాటుగా, అంతర్జాల పత్రికలు కూడా దిగ్విజయంగా, రచయితల, కవుల రచనలను చదువరులకు చేరవేయడంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఈ అంతర్జాల పత్రికలు చాలా వెసులుబాటును, సౌలభ్యాన్ని మనకు కలిగిస్తాయి. ప్రపంచమంతా, ఒక కుగ్రామంగా మారిపోయిన ఈ సందర్భంలో, అంతర్జాల పత్రికల పాత్ర చాలా ముఖ్యమైనది. క్రమేపీ, అచ్చు పుస్తకాల స్థానాన్ని పూర్తిగా ఆక్రమించుకోకపోయినా, చాలా వరకు వాటికి ఒక ప్రత్యామ్నాయాంగా, అంతర్జాల పత్రికలు, వేదికలు పనిచేస్తున్న విషయాన్ని మనం ఇక ఏమాత్రం విస్మరించజాలం. ఈ నేపథ్యంలో, ముఖ్యంగా మనుషుల మధ్య భౌతిక దూరాన్ని ఒక అత్యావసర సందర్భంగా మార్చివేసిన కోవిడ్-19 ప్రపంచాన్నంతటినీ గడ గడలాడిస్తున్న ఈ తరుణంలో, అంతర్జాల పత్రికలు పోషిస్తున్న పాత్ర చాలా గణనీయమైనది. ఇప్పుడు సాహితీ సేవ చేస్తున్న అంతర్జాల పత్రికలలో, ‘ప్రతిలిపి’ నిస్సంశయంగా ముందువరసలో నిలుస్తుంది. ‘ప్రతిలిపి’ చేస్తున్న సాహితీ యజ్ఞంలో, నేను కూడా ఎంతో కొంత నా రచనల ద్వారా పాలుపంచుకోవడం నాకు చాలా ఆనందదాయకం. నాలాగా, ఇంకా ఇతర రచయితలు, రచయిత్రుల్లాగా, ఎవరైనా తమ రచనలను ప్రతిలిపి ద్వారా పాఠకులకు చేరవేయవచ్చు. ఇదొక సులభమైన మార్గం. ‘ప్రతిలిపి’లో నా రచనల్ను ముద్రించడం ద్వారా నేను ఎంతో మంది అనుచరులను సంపాదించుకున్నాను, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది! అందుకు నా అనుచరులకు, ఈ అవకాశాన్ని కలిగించిన ‘ప్రతిలిపి’ యాజమాన్యానికి నేను కృతజ్ఞుడిని. కొందరు పాఠకులు కేవలం అనుసరించడమే కాకుండా, నా రచనలను చదివి తమ అమూల్యమైన అభిప్రాయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి నాకు చాలా స్ఫూర్తిని కలిస్గితూ ఉంటాయి. నా రచనలపై వచ్చే విమర్శ నాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. నేను చేయబోయే తదుపరి రచనలకు అది ఒక చుక్కానిగా పని చేస్తుంది. వర్ధమాన రచయిత/రచయిత్రులకు కొన్ని సూచనలు 1.రచనలు చేయాలనుకునే వారు, ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని ఇష్టంతో అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. మనకు ఎందరివో లబ్ద ప్రతిష్టులైన కవుల, రచయితల రచనలు పుస్తక రూపంలోనూ, అంతర్జాలంలో నిక్షిప్తపరచబడి ఉన్నాయి. వాటిని తరచుగా, ఒక అలవాటుగా చదువుతూ ఉండాలి. 2.అలాగే క్రమం తప్పకుండా తమకు కలిగిన భావాలను, స్పందనలకు అక్షర రూపం ఇస్తూ ఉండాలి. రాసిన వాటిని మరల, మరలా సరిచూసుకుని, స్వసమీక్ష/ఇతరుల చేత సమీక్షింప చేసుకుని, తదుపరి పత్రికలకు పంపాలి. 3.కొత్తలో మన రచనలు కొన్ని పత్రికలచే తిరస్కరించబడవచ్చు. ఐనా నిరాశ చెందరాదు. ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. ఎక్కడ మన రచన ప్రామాణికంగా లేదో తెలుసుకుని, రచనను మెరుగుపరచాలి. 4.ఒక శిల్పి తన శిల్పాన్ని చెక్కినట్లు, తదేక ఏకాగ్రతతో, మన రచనలను మనమే ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు తెలిసిన కొన్ని విషయాలను క్లుప్తంగా మాత్రమే తెలియచెయ్యడం జరిగింది. ఇంకా వివిధ మార్గాల్లో రచనలు చేయబోయేవారు తమ రచనా సామర్ధ్యానికి మెరుగులు పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ తొలి రచనను మొదలు పెట్టండి, పూర్తి చెయ్యండి. ప్రతిలిపిలో ప్రచురించండి!!! శుభాకాంక్షలతో శివ్ (బి.వి. శివ ప్రసాద్)