ఆంధ్రా యునివర్సిటి నుండి మాస్టర్ డిగ్రీ తీసుకున్నాను. పేపర్ తయారు చేసే పరిశ్రమలలో వివిధ విభాగాలలో పనిచేసి చివరగా జాయింట్ సేల్స్ మేనేజర్గా పదవీ విరమణ చేశాను. అనేక ప్రముఖ పత్రికలలోనూ 400 పైగా కథలు వీటిలో ముఖ్యంగా స్వాతి, విపుల , నవ్య, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ , ఆంధ్ర పత్రిక , సహరి కాక ఎన్నో వెబ్ పత్రికలు ఉన్నాయి. కథలు వ్రాస్తున్నా మొదటలో ఒక కథ అమెరికా లోని తెలుగు అమెరికా పత్రికలో (బ్రహ్మచారులు -అద్దె కొంప ) ప్రచురించినప్పటినుండి కథలు వ్రాయాలనే తాపత్రయం పెరిగింది. 1981 లో మొట్ట మొదటగా ఆకాశవాణి కడప కేంద్రం నుండి ధనమూలం ఇదం జగత్, ఆయుధ పూజ ప్రాముఖ్యత, క్రమ శిక్షణ లాంటి కథలు, వ్యాసాలు చదివి ఆ తదుపరి కాలంలో ఆకాశవాణి ఆదిలాబాద్, హైదరాబాద్ కేంద్రాలలో ముప్పైకి పైగా కథానికలు ప్రసారమయ్యాయి. ప్రస్తుతం ముఖ్య పత్రికలలో రచనా వ్యాసంగం కొనసాగుతోంది. ఇది కాకుండా 2017 నుండి కార్టూన్ రంగంలోకి అడుగుబెట్టి జెఎన్నెమ్ పేరుతో ప్రింట్ మరియు వెబ్ పత్రికలలో రెండు వేలకు పైగా కార్టూన్లు వెయ్యడం జరిగింది. నా కార్టూన్లల్లో ముఖ్యంగా (j-jovial,n-natural, m -message oriented గా ఉండేటట్టు చూసుకుంటాను. కార్టూన్లు పెద్ద ఆర్భాటం లేకుండా సింపుల్ వ్యాఖ్యలతో పాఠకులకు వెంటనే అర్ధమయ్యే రీతిలో వెయ్యడమే లక్షణంగా పెట్టుకున్నాను. నేను ఎవరికీ ఈ విషయంలో పోటీ కాను. అలా సైలెంట్ గా 35 పత్రికలలో కార్టూన్లు వెయ్యగలిగాను. అనేక బహుమతులు కథలకు, కార్టూన్లకు అందుకున్నాను. ఇవి కాక అనేక తెలుగు కినిమాలకు వివిధ పత్రికలకు సమీక్షలు వ్రాయడం జరిగింది. ఇక నేను వ్రాసిన , వ్రాస్తున్న కథలు ఎవరి సహనాన్ని పరీక్షించాలనే ఉద్దేశ్యం లేదు. అందుకే ప్రతి కథలోనూ చెప్పాలనుకునేది గన్ షాట్గా చెప్పడం కోసం చిన్న చిన్న కథలనే ఎన్నుకుంటాను. అవి కూడా మాక్జిమమ్ హాస్య ప్రధానమైన subjects ఎన్నుకోవడం జరిగింది. నా సోత్కర్ష నేను చెప్పుకోదల్చుకోలేదు. ప్రతిలిపి లోని రచయితలు, ఇతర వర్గాల వారిని కోరుకునేది ఏమిటంటే నా రచనలు దయచేసి మీకు వీలున్నప్పుడు చదివి మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే మీ అమూల్యమైన కామెంట్స్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. సర్వేజనా సుఖినోభవతు
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్